హైదరాబాద్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న టెకీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని పాన్ బజార్లో శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి నిందితుడు ఆకుల మెహుల్ కుమార్(26)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి నాలుగు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఓ బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహుల్ కుమార్ నగరంలోని ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. తన తండ్రి నడుపుతున్న మెడికల్ షాపులో కూర్చున్నప్పుడు రెమ్డెసివిర్ కోసం డిమాండ్ను గమనించాడు. ఆ తరువాత డీలర్ల నుండి తక్కువ రేటుకు తీసుకుని అక్రమంగా అధిక రేటుకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కో ఇంజక్షన్ను రూ.4 వేలకు కొనుగోలు చేసి రూ. 35 వేలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నాడు. మెహల్ కుమార్పై తదుపరి చర్యలకు గాను టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని మహంకాళి పోలీసులకు అప్పగించారు.