చెన్నై : మమైనర్ బాలికను మాయమాటలతో లొంగదీసుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి (37)ని తమిళనాడులోని తిరుపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అనుప్పరపాళ్యానికి చెందిన టైలర్గా పనిచేసే నాగరాజుగా గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా కోయంబత్తూర్కు చెందిన విద్యార్ధిని (17)తో పరిచయం పెంచుకున్న నాగరాజు ఆపై ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
స్నేహం నటిస్తూ కొద్దిరోజుల కిందట నగరంలో బాలికను కలుసుకున్న నిందితుడు నాగరాజు ఆమెను తన స్వగ్రామానికి తీసుకువెళ్లి పెండ్లి చేసుకున్నాడు. బాలిక కనిపించడం లేదంటూ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో ఆమె నాగరాజుతో కలిసి వెళ్లినట్టు వెల్లడైంది. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం తిరుపూర్ వెళ్లి బాలికను నిందితుడి చెర నుంచి కాపాడారు. పెండ్లి పేరుతో మైనర్ బాలికపై నాగరాజులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.