సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి తండ్రి గుండెమీద వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమీద రామలింగస్వామి(38) ఒకరి ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడుతున్నాడు.
ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్లో నష్టాలు రావడంతో సుమారు 60 నుంచి రూ.70లక్షలు అప్పులు అయ్యాయి. ఈ నెల 22న సూర్యాపేట పట్టణ కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో సాయి బృందావన్ లాడ్జిలో 302 గదిని అద్దెకు తీసుకొని ఉంటున్న రామలింగస్వామి గురువారం మధ్యాహ్నం నుంచి బయటకు రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం వెళ్లి చూడగా రామలింగస్వామి బాత్రూమ్లో మృతి చెంది ఉన్నాడు. వారి సమాచారంతో సూర్యాపేటకు వచ్చిన రామలింగస్వామి తండ్రి వెంకటనారాయణ అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పేర్కొన్నాడు.
వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.