నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ట్రాక్టర్ షోరూమ్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జర్నల్ దవాఖానకు తరలించారు. మృతుడు భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన యాదయ్య(35)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. కాగా, మృతికి గల కారణాలను తెలియాల్సి ఉంది.