బంజారాహిల్స్ :అర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఎలుకల మందు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతరపురం జిల్లా నర్పల్ మంగలం బండ్లపల్లి గ్రామానికి చెందిన బి.ఫకీరయ్య(60) బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి 15ఏండ్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 గాయత్రీహిల్స్లోని ఓ ప్లాట్ కు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
గత కొంతకాలంగా అప్పులు పెరగడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫకీరయ్య పనిచేస్తున్న ప్లాట్లో అర్థరాత్రి దాటిన తర్వాత ఎలుకల మందు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటికి స్థానికులు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ మేరకు మృతుడి భార్య ఈశ్వరమ్మ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.