చెన్నై : తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో దుకాణదారును వేధించిన మహిళా ఎస్ఐ సహా ముగ్గురు కానిస్టేబళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. షాపులో బ్రెడ్ ఆమ్లెట్ తిని జ్యూస్ తాగిన అనంతరం వాటర్ బాటిల్స్ తీసుకున్నారు. వాటికి డబ్బులు ఇవ్వాలని షాపులో పనిచేసే వ్యక్తి అడగడంతో అతడి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
డబ్బు చెల్లించేందుకు నిరాకరించిన విజయలక్ష్మితో పాటు ఇతర మహిళా కానిస్టేబుళ్లు దుకాణం లైసెన్స్ను రద్దు చేస్తామని బెదిరించారు. షాపు యజమాని మణిమంగళం ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అనంతరం ఎస్ఐ విజయలక్ష్మితో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లను తాంబరం కమిషనర్ అమల్రాజ్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు.
Read More
Odisha Train Accident | పరిహారం కొట్టేసేందుకు కొత్త తరహా మోసం.. చనిపోయింది మా వాళ్లే అంటూ డ్రామాలు