నిజాంపేట,జూన్17: రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలైన కంది , పత్తి, వేరుశనగ, మినుములు, సన్ఫ్లవర్ వంటి పంటల సాగుకు మొగ్గు చూపాలని జిల్లా వ్యసాయ అధికారి పరశురాం నాయక్ అన్నారు.గురువారం ఆయన నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో వర్షాకాల పంటల సాగు,పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో పంట మార్పిడి పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. వరి సాగులో వెదజల్లే పద్ధతి పాటించడం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయడం వల్ల ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని అన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు కంది విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో రామాయంపేట డివిజన్ ఏడీఏ వసంతసుగుణ,మండల ఏవో సతీశ్,ఏఈవో దివ్యశ్రీ, గణేశ్కుమార్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్,పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి,రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వై.వెంకటేశం,రైతులు ఉన్నారు.
ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపించాలి
రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపించాలని జిల్లా వ్యవసాయాశాఖాధికారి పరశురాంనాయక్ రైతులకు సూచించారు.తూప్రాన్ ఐకేపీ కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి సీజన్లో వేసిన మాదిరిగా కా కుండా ఇతర పంటలపై ఆసక్తి చూపించాలన్నారు.సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నుస్రత్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సురేందర్రెడ్డి, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ బాబుల్రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.