సికింద్రాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై యుగంధర్ కథనం ప్రకారం… నిజామాబాద్ కు చెందిన నజీర్ సీమా ఫాతిమా దంపతులకు ముగ్గురు కుమారులు పిల్లలను చదివించుకునేందుకు నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి గత కొద్ది సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు.
ప్రస్తుతం వీరు న్యూ బోయిన్పల్లి హర్షవర్థన్కాలనీలో నివాసముంటున్నారు. నజీర్ దుబాయ్లో పని చేస్తుండగా, సీమా ఫాతిమా ఇంట్లో నే ఉంటు పిల్లల ఆలనా పాలనా చుసుకుంటుంది. చిన్నకుమారుడు మోహమ్మద్ ఓబెల్ (13) స్థాని కంగా ఉన్న ఓ పైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడు తున్న ఓబెద్కు నజీర్ మెరుగైన చికిత్స చేయిస్తున్నాడు.
బుధవారం పాఠశాలకు వెళ్లిన ఓబేద్ పాఠశాల అనంతరం కాలి నడకన ఇంటికి బయలుదేరాడు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాల్సిన ఓబేద్ ఇంటికి వెళ్లకుండా కాలనీలోని లోటస్ స్ప్రింగ్ అపార్ట్మెంట్కు వెళ్లి, నాలుగో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించి, తల్లి ఫిర్యాదు మేరకు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.