భువనేశ్వర్ : ఖాకీల కండ్లుకప్పి మత్తుపదార్ధాలను అక్రమంగా తరలిస్తున్న భారీ డ్రగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల డ్రగ్ రాకెట్లను పోలీసులు భగ్నం చేస్తున్నా అడ్డదారుల్లో అక్రమార్కులు చెలరేగుతూనే ఉన్నారు.
తాజా ఘటనలో ఒడిషా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విభాగం భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. నయాగఢ్ జిల్లాలోని ఉదయలనె గ్రామంలోని ఓ ఇంటి నుంచి దాదాపు రూ 4 కోట్ల విలువైన 3.1 కిలోల బ్రౌన్ షుగర్ను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకుని అక్రమార్కుల ఆట కట్టించారు.
ఆ ఇంటి నుంచి పోలీసుల బృందం రూ 65 లక్షల నగదు, మూడు 7ఎంఎం తుపాకులు, మందుగుండు సామాగ్రి, నోట్ల కౌంటింగ్ యంత్రం, నాలుగు మొబైల్ ఫోన్లు, ఓ ట్యాబ్లెట్ను సీజ్ చేశారు. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. ఏపీ నుంచి కూడా పలు రాష్ట్రాలకు చేరవేస్తోన్న డ్రగ్స్ను ఇటీవల పోలీసులు పలు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.