వికారాబాద్ : వాహనాల బ్యాటరీలను దొంగిలించిన ఇద్దరు యువకులను పట్టుకొని రిమాండ్ చేసినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. బుధవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో నింధితులను వివరాలు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. వికారాబాద్ పట్టణం రామయ్యగూడకు చెందిన శిఖరేశ్, షేక్ ముజాకిర్ డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరు వికారాబాద్ పట్టణంలో ఆగి ఉన్న జేసీబీ, లారీ, ఇటాచి, ట్రాక్టర్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలను దొంగిలించేవారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. దొంగిలించిన బ్యాటరీల విలువ దాదాపు రూ. 3లక్షల వరకు ఉంటుందన్నారు. దీంతో ఇద్దరు యువకులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సీఐతో పాటు ఎస్సై ఆనంద్ ఉన్నారు.