పట్నా : మైనర్ బాలిక వెంటపడి వేధిస్తున్న యువకుడిని వారించినందుకు ఆమెపై దాడికి పాల్పడిన ఉదంతం మధ్యప్రదేశ్లోని తుకోగంజ్లో వెలుగుచూసింది. పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. స్కూల్ అడ్మిషన్ కోసం మైనర్ బాలిక ఫ్రెండ్తో కలిసి స్కూల్కు వెళ్లి వెనుతిరిగి వస్తుండగా నిందిడుతు అమిత్ ఆమెను వెంబడించాడు.
బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితుడు ఆమె అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా కత్తితో ఆమె ముఖంపై పొడిచాడు. నిందితుడు ఆపై ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన బాలికను ఆమె ఫ్రెండ్ దవాఖానకు తరలించారు. నిందితుడు అమిత్ ఇండోర్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.