న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని పీతంపురా ప్రాంతంలో ఓ స్పాలో మహిళ (22)పై స్పా మేనేజర్, కస్టమర్ సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు శనివారం ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది.
డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ సామూహిక లైంగిక దాడిపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. పీతంపురలోని ఓషన్ స్పాలో బాధితురాలు పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది. స్పా మేనేజర్ తనను ఓ క్లైంట్కు పరిచయం చేశాడని వారు పానీయంలో మత్తు మందు కలిపి తనకు ఇచ్చారని డీసీడబ్ల్యూకు మహిళ తెలిపింది. తాను స్ప్రహ కోల్పోగానే ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారని వెల్లడించింది.
ఈ విషయం ఎవరికి చెప్పవద్దని తనకు డబ్బు ఆఫర్ చేశాడని తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కు నోటీసులు ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఘటనలో అరెస్టయిన నిందితుల వివరాలను సమర్పించాలని స్వాతి మలివాల్ కోరారు.