నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా మద్నూర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడు, తమ్ముడు కలిసి మహిళ గొంతు కోసి హతమార్చేందుకు యత్నించారు. మద్నూర్కు చెందిన లక్ష్మికి ఆమె కుమారుడు రవికి మధ్య కొంతకాలం కుటుంబ కలహాలున్నాయి. ఈ క్రమంలో రవి ఇవాళ తన మేనమామ ప్రవీణ్తో కలిసి లక్ష్మి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.