చెన్నై : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతండ్రిని కడతేర్చిన కసాయి ఉదంతం తమిళనాడులోని కడలూరులో సోమవారం వెలుగుచూసింది. మద్యానికి బానిసైన నిందితుడు ఐరన్ రాడ్తో తండ్రిపై దాడి చేయడంతో అతడు మరణించాడని పోలీసులు తెలిపారు. తండ్రి మృతదేహాన్ని ఉంచేందుకు ఫ్రీజర్ బాక్స్కు నిందితుడు ఆర్డర్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఘటనా స్ధలానికి చేరుకున్న కడలూర్ పోలీసులు నిందితుడు కార్తీక్ను అదుపులోకి తీసుకున్నారు.
చెన్నైలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేసే కార్తీక్ ఏడాదిన్నర కిందట ఉద్యోగం వదిలివేసి కడలూరులోని తండ్రి వద్దే ఉంటున్నాడు. బాధిత తండ్రిని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రమణియన్గా గుర్తించారు. మద్యానికి బానిసైన కార్తీక్ తరచూ మద్యం తాగేందుకు తండ్రిని డబ్బు ఇవ్వాలని వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన కార్తీక్ తండ్రిపై ఇనుప రాడ్తో దాడి చేసి విపరీతంగా కొట్టడంతో ఆయన మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.