శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రయాణీకుల నుంచి 412 గ్రాముల స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం… దుబాయ్ నుంచి 6ఇ 025, ఎఫ్జెడ్ 439 విమానాలలో హైదరాబాద్కు ఇద్దరు ప్రయాణీకులు వచ్చారు.
అందులో ఓ ప్రయాణీకుడు బ్రాసులెట్లో, మరో ప్రయాణీకుడు చిన్న ఉంగరాల మాదిరిగా చేసి స్మగ్లింగ్కు విఫలయత్నం చేశారు. వారి నుంచి పట్టుబడిన రూ. 20.49 లక్షల విలువ చేసే 412 గ్రాముల స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసకున్నారు. ఈ మేరకు వారిద్దరిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.