బీబీనగర్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్నట్టు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పశువులను తరలిస్తున్నట్టు పెట్రోలింగ్ మొబైల్ 100 నంబరుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు మండలంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించి హైదరాబాద్ కు తరలిస్తున్న రెండు డిసిఎం వ్యాన్లను పట్టకున్నారు.
పట్టుకున్న వాహన డ్రైవర్లను విచారించగా ఓ వాహనంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బహదూర్పురాకు తరలిస్తున్నట్టు డ్రైవర్ నరేష్ తెలిపాడు. మరో వాహనంలో డ్రైవర్ ఇర్షాద్ చేరాలకు చెందిన రియాజ్వని బహదూర్పురాకు తరలిస్తున్నట్టు చెప్పాడు. పట్టుకున్న 38 ఆవులు, 41 ఎద్దులను గోశాలకు తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.