గువాహతి: బాలికపై ఆరుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టీ గార్డెన్లో పని చేసే కుటుంబాలకు చెందిన ఆరుగురు బాలురు దారుణానికి పాల్పడ్డారు. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీనగర్ ఏరియాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఈ సంఘటనపై సీరియస్గా స్పందించారు. పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలించారు. బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు బాలురను అరెస్ట్ చేశారు. నిందితులంతా 13-15 ఏళ్ల వయసు వారని పోలీసులు తెలిపారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మైనర్లు కావడంతో బాల నేరస్తులుగా పరిగణించి సంబంధిత కోర్టు విధానాలు పాటిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.