బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, నిషా వయసు 22 ఏళ్లు. వీళ్లు ముగ్గురూ కూడా మహరాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన వాళ్లని తెలుస్తోంది.
ఒక చిన్నారిని తీసుకొని ముంబైకి వచ్చిన ఈ ముగ్గురూ.. దొంగతనాలు చేయడమే లక్ష్యంగా తిరిగేవారు. బిచ్చగాళ్లలా నటించి ఆ తర్వాత చాలా ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు దొంగతనాల కేసుల్లో నిందితులైన వీరిని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.