అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎస్ఐ అజయ్బాబు లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. వినుకొండ గ్రామానికి చెందిన ఖాసిం అనే వ్యక్తి నుంచి రూ. 40వేలు లంచం తీసుకుంటుండడగా మాటువేసిన ఏసీబీ అధికారులు ఎస్ఐను రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
ఒక కేసు విషయంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారుల ప్రణాళికతో బాధితుడు ఎస్ఐకు లంచం అందజేస్తుండగా పట్టుకున్నారు. ఎస్ఐపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. లంచం డిమాండ్ లో పాత్ర ఉన్న హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు, ప్రైవేట్ డ్రైవర్ షఫీలను కూడా అరెస్టు చేశారు.