బంజారాహిల్స్,ఆగస్టు 24 : మద్యం తాగడం మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ కూతురు గట్టిగా మందలించడంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిన తల్లి అదృశ్యమైంది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్కు చెందిన పి.సువర్ణ(55) గత పదిహేనేళ్లుగా కుమార్తె మమత ఇంట్లోనే ఉంటోంది. ఒక్కతే కూతురు కావడంతో ఆమె వద్దనే ఉంటున్న సువర్ణ గత కొంతకాలంగా మద్యం తాగే అలవాటు చేసుకుంది. ఈ నెల 21న పని నుంచి తిరిగి వచ్చిన మమతకు తన తల్లి పీకలదాకా మద్యం సేవించి కనిపించింది.
దాంతో ఎక్కువగా మద్యం తాగి ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకుంటావంటూ తల్లి సువర్ణతో గొడవ పడింది. మరుసటిరోజు ఉదయం కూడా ఇదే విషయంపై వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు స్వేచ్చ లేదని, తాను ఇంట్లోంచి వెళ్లిపోతానంటూ సువర్ణ చెప్పింది. అయితే గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడి బయటకు వెళ్లిన తల్లి మాటలను తేలిగ్గా తీసుకున్న మమత డ్యూటీకి వెళ్లిపోయింది.
అయితే సాయంత్రం తిరిగి వచ్చిచూడగా తల్లి సువర్ణ కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.