శంకర్పల్లి : శంకర్పల్లి మండలం అలాంఖాన్గూడ గ్రామ శివారులో శుభగృహ వెంచర్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి శుభగృహ గేటు వద్దకు రావాని కోరడంతో తెల్లవారు జామున 4 గంటలకు అతడు గేటు వద్దకు వెళ్లాడు. కండ్లలో కారంపొడి చల్లి ముఖం, చేతులపై కత్తితో దాడి చేయగా వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఫోన్ ఎవరు చేశారో ఆరా తీస్తున్నామని చెప్పారు. కాగా మృతుడి భార్య హంసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.