షాద్నగర్ : ఓ గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 45సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ పట్టణంలోని కీర్తి వెంచర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మహిళా వంటిపై కాళ్ల కడియాలు, చెవి గెంటీలు, నీలం రంగు చీర ధరించి ఉందని చెప్పారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. మృతదేహం వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.