షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చెందిన పవన్ (18), విక్రాంత్ (19) బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో షాబాద్ నుంచి సర్దార్నగర్కు ద్వీచక్ర వాహనంపై వెళ్తున్నారు. సర్దార్నగర్ వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ వీరి ద్వీచక్ర వాహనాన్ని ఢీకోట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన పవణ్, విక్రాంత్లు అక్కడిక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.