లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురిని స్థానికులు కాపాడగా.. మరికొందరు గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమాచారం ప్రకారం.. ఘటన రేవతిపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్తో సహా ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో 19 మందిని రక్షించారు.
బుధవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరగ్గా.. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెంచారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లో వరదలు పోటెత్తుతున్నాయి. రేవతి జిల్లాలోని పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఈ క్రమంలో అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డీజిల్ బోట్లు ఏర్పాటు చేశారు. పలువురు బోట్లో వెళ్తుండగా.. నదిలో కొంత దూరం వెళ్లగానే.. నీటిలో మునిగిపోయింది. దీంతో బోటులో ఉన్న వారంతా కేకలు వేయగా.. అక్కడే ఉన్న పలువురు వేగంగా స్పందించి 19 మందిని రక్షించారు.
పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి వరకు ఐదుగురి మృతదేహాలు వెలికి తీశారు. గురువారం మధ్యాహ్నం వరకు గల్లంతైన వారి కోసం గాలించగా.. మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే, ప్రమాదానికి బోటులో పరిమితికి మించి ఎక్కువ మంది ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.
25 प्रवाशांना घेऊन जाणारी बोट नदीपात्रात बुडाली. थरकाप उडवणारा व्हिडीओ व्हायरल#UttarPradesh #BoatAccident #Police #UttarPradeshNews #BoatCapsize #Gazipur pic.twitter.com/Wf3W8S1MKZ
— Satish Daud (@Satish_Daud) September 1, 2022