కాచిగూడ : రోడ్డుపై నడుచుకుంటు వెలుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం సీతాఫల్మండీ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పెంటయ్య(56) మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లడానికి మార్గ మధ్యలో రోడ్డు దాటుతుండగా అదే సమయంలో ఏపీ 09 టీఏ 0956 ద్విచక్రవాహనం డీకొట్టింది.
దీంతో పెంటయ్య తలకు తీవ్ర గాయాలైనాయి.బాధితుడు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.