కొండాపూర్ : కొండాపూర్లోని గౌతమీ ఎన్ క్లేవ్ లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు దిగిన ఘటనలో విషవాయులను పీల్చి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, వారిని కాపాడేందుకు వెళ్ళిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
కాగా అస్వస్థతకు గురైన సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ స్వామి, క్లీనర్ జానీలు సమీపంలోని కొండాపూర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ప్రమాదంలో కండ్లకు ఇన్ఫెక్షన్ కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సరోజిని కంటి దవాఖానకు వెళ్ళాల్సిందిగా దవాఖాన వైద్యులు సూచించినట్లు దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ వరదాచారి తెలిపారు.
ప్రస్తుతం అస్వస్థతకు గురైన ఇద్దరు జిల్లా దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు.