సంగారెడ్డి : కర్ణాటకలోని బీదర్ నుంచి అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్న గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గుట్కా తరలిస్తున్నారనే విశ్వస సమాచారం మేరకు..హుగ్గెల్లి శివారులోని జాతీయ రహదారి 65 కల్వరి టెంపుల్ వద్ద తనిఖీలు నిర్వహించారు.
బీదర్ నుంచి హైదరాబాద్కు (TS 13EM 6255) నెంబర్ సుజుకి ఈకో వాహనంలో అక్రంమంగా తరలిస్తున్న నిషేదిత గుట్కాను పట్టుకున్నారు. బండిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన గుట్కా విలువ సుమారు రూ. 2,42,270 విలువ ఉంటుందని ఎస్ఐ రవి తెలిపారు.