యాదాద్రి భువనగిరి : ఆలేరులో అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆలేరు మండలం గుండ్లగూడం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఆలేరులో పలుచోట్ల రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఇదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ మేరకు స్థానిక ఎస్ఐ ఇద్రిస్ అలీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
350 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం