వరంగల్ : నిషేధిత మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. జిల్లా కేంద్రం గిర్మాజిపేటలో ఓ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన 15 రకాల గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 7.75 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు.
శివనగర్ కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి గిర్మాజిపేటలో ఓఇల్లు అద్దెకు తీసుకొని రెండు గదుల్లో ఈ గుట్కా పాకెట్లు నిలువ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.