వికారాబాద్ : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..కర్ణాటక రాష్ట్రం నుంచి యాలాల మండలం జక్కేపల్లి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు కొడంగల్ మండలం రుద్రారం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గుట్కా ప్యాకెట్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాల విలువ సుమారు 18,950 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.