హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తం బంగారాన్ని పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడు బంగారాన్ని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు బుధవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ ప్రయాణికుడి వద్ద రూ.60లక్షల విలువైన ఒక కిలో 280 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయి నుంచి కొచ్చి వరకు బంగారాన్ని తీసుకువచ్చిన మరో వ్యక్తి బంగారాన్ని విమానం మరుగుదొడ్డిలో కొచ్చిలో దిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అదే విమానంలో కొచ్చిలో విమానం ఎక్కిన కేరళ వాసి హైదరాబాద్కు తీసుకువచ్చారని వెల్లడించారు. ఈ మేరకు కేరళ వాసిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని ఇక్కడ ఎవరికి ఇచ్చేందుకు తీసుకువచ్చాడనే విషయమై ఆరా తీస్తున్నారు.