హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు.
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా రియాద్ నుంచి తీసుకొచ్చిన బంగారు గాజులను ముగ్గురు కేటుగాళ్లు ప్యాంటులో దాచారు. ముగ్గురు రియాద్ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సుమారు రూ. 34 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.