సూర్యాపేట : యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గంజాయి నుంచి తీసిన రూ.7.5 లక్షల విలువగల యాషిస్ ఆయిల్ను కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
నమ్మదగిన సమాచారం మేరకు కోదాడ పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారన్నారు. అనుమానాస్పదంగా ఉన్న కమాండర్ జీప్ను తనిఖీ చేయగా.. అందులో గంజాయి నుంచి తయారైన 1.5 యాషిస్ ఆయిల్ గుర్తించి స్వాధీనం చేసుకొని చేసుకుని 5 గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
అరెస్టు అయిన వారిలో బోడేపూడి సురేశ్ కోదాడ, గెమ్మెలి జాన్ విక్టర్ ఏపీలోని విశాఖపట్నం జిల్లా దొమ్మాయి గూడెం మండలం కర్రబల్లి గ్రామం, అదే జిల్లా బిజ్జపల్లికి చెందిన వంతల భీమరాజు, పాడేరు మండలానికి చెందిన కిడాంగిలతో పాటు కోదాడకు చెందిన అశోక్ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
వీరి నుంచి1.5 లీటర్ల యాషిస్ ఆయిల్, రూ. 10వేల నగదు, 5 సెల్ ఫోన్లు ఒక కమాండర్ జీప్, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరాలను వెల్లడించారు.
నిందితులు యాషిస్ ఆయిల్ ను ఆంధ్ర , ఒడిషా సరిహద్దులో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి రూ.75,000 లకు కొనుగోలు చేసి ఆ ఆయిల్ ను 10 Ml నురూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.
టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినదించి రివార్డ్స్ అందించారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి