న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 21 మంది పిల్లలతో వెళుతున్న స్కూల్ బస్, మూడు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం గురించి మధ్యాహ్నం 2.15 గంటలకు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నామని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
వాహనాలు మంటల్లో ఎందుకు చిక్కుకున్నాయనే వివరాలు తెలియలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సమాచారం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. ఇక ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.