వికారాబాద్ : ఖాతాదారుల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకుని, చెల్లించిన రూ. 1. 57కోట్లను ఇన్చార్జి మేనేజర్ స్వాహా చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ వ్యక్తిగత కారణాల వల్ల మూడు నెలలు సెలవు పెట్టాడు. సహాయ మేనేజర్ శివకుమార్కు ఇన్చార్జి మేనేజర్గా బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన 29మంది ఖాతారుదారులు రూ. 1.57కోట్లు చెల్లించి విడిపించుకున్నారు. ఇట్టి డబ్బులను ఇన్చార్జి మేనేజర్ బ్యాంక్లో జమ చేయకుండా స్వాహా చేశాడు. సెలవు పై వెళ్లిన మేనేజర్ సాయిరాం గత నెల డిసెంబర్లో వచ్చి బ్యాంక్ మేనేజర్గా నియమితులయ్యారు.
బ్యాంక్ ఖాతాను పరిశీలించగా రూ. 1.57కోట్లు తేడా వచ్చింది. దీంతో అసిస్టెంట్ మేనేజర్ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో బ్యాంక్ మేనేజర్ శివకుమార్పై పోలీసులకు డిసెంబర్ 23న ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి మేనేజర్ శివకుమార్ స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై జనవరి 6న కేసు నమోదు కేసుకొని న్యాయస్థానంలో హాజరు పర్చి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.