హైదరాబాద్ : అధికారుల వేధింపులతో రాణిగంజ్- 1 డిపోకు చెందిన అర్టీసీ డ్రైవర్ తిరుపతి రెడ్డి (50) పురుగుల మందు తాగి డిపో ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజులు తిరుపతి రెడ్డి విధులకు హాజరు కాలేదని ఈ నెల 22వ తేదీ నుంచి అతడికి అధికారులు డ్యూటీ అప్పగించలేదు. దీంతో ఉదయం డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డి ఈ రోజు కూడా డ్యూటీ ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది వెంటనే అతడిని ఉస్మానియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు డిపో వద్దకు చేరుకొని ఆందోళనకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల