Yadadri | యాదాద్రి భువనగిరి : జిల్లాలోని వలిగొండ మండలం( Valigonda Mandal ) టేకులసోమారం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు( RTC Bus ) అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ స్టీరింగ్ మధ్యలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నల్లగొండ నుంచి భువనగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
భద్రాచలం – గుండాల మార్గంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు దాన్ని ఆపేశారు. అనంతరం కారులో నుంచి దిగేశారు. కాసేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక మండలం గుండాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.