అమరావతి : గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మృతుడిని పట్టణంలోని అమరావతి కాలనీకి చెందిన తరుణ్గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నది. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పలు నేరాల్లో తరుణ్ నిందితుడిగా ఉండటంతో హత్యకు గల కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.