శామీర్పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నక్రమంలో శామీర్పేట మండలం రాజీవ్ రహదారిపై ఉన్న హనిబర్గ్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు స్వల్పంగ గాయపడ్డారు.
నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ప్రమాద సమయంలో వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటన చూసిన గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.