హైదరాబాద్లోని మల్కాజ్గిరి చర్లపల్లి రోడ్డు దగ్గర గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఆరుగురు విద్యార్థులున్నారు.