శేరిలింగంపల్లి : రాయదుర్గం బస్స్టాఫ్లో హత్యకు గురైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున తలపై బండరాయితో మోదడంతో హత్యకు గురైన సదరు వ్యక్తిని పాత నేరస్థుడు షేక్ మాజీద్గా పోలీసులు నిర్ధారించారు. నగరంలోని బంజారహిల్స్ పస్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ మాజీద్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ మాజీద్(32) పెయింటిగ్ పని చేసుకుంటు జీవిస్తున్నాడు.
ఇతడిపై హుమాయన్నగర్, రాజేంద్రనగర్, ఆసిఫ్నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్స్టేషన్ల పరిధిలో పలు వాహనాల దొంగతనాలు, జేబు దొంగతనాలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. పాత నేరస్థుడైన మాజీద్ను హత్య చేసిన వారి ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.