కొందుర్గు : ఎదురెదురుగ వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్ నుంచి వస్తున్న టీఎస్ 07 యుహెచ్ 6259 బులేరో వాహనం పరిగి నుంచి వస్తున్న టీఎస్ 12 యుసీ 0401 నంబర్ గల టాటా ఎసీ వాహనాలు కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్ వద్ద ఢీకొన్నాయి. దీంతో బులేరో వాహనం డ్రైవర్ వెంకటేష్ (35) ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇమ్రాన్, సలీం అనే వ్యక్తుల కాళ్లు విరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి క్షతగాత్రులను చికిత్స నిమ్మిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు నుంచి ఫిర్యాదులు అందలేదని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామన్నారు.