యాచారం : రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి ఇబ్రహీంపట్నం సివిల్జడ్జి గురువారం ఇచ్చిన తీర్పులో శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా దుగ్గీ మండలం ముక్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ మెహర్ బాబు 2016లో ఓ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి జడ్జి వరలక్ష్మి నిందితుడు మెహర్బాబుకు సంవత్సరం జైలు శిక్షతో పాటుగా రూ. 3000లు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు సీఐ లింగయ్య తెలిపారు.