చేవెళ్ల టౌన్ : గేదెను తప్పించబోయి ఆటో కారును ఢీకొన్న సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లాలోని కోస్గి మండంలోని బాలభద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రమేశ్, కోస్గి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన జంగమ్మ, వికారాబాద్ జిల్లాలోని తాండూర్కు చెందిన అమృత, యాలాలకు చెందిన లలితా, అదే గ్రామానికి చెందిన లక్ష్మీ పిల్లలు చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల గ్రామ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. అయితే ఆదివారం కావడంతో తమ పిల్లల దగ్గరకు చేవెళ్లలో ఆటో తీసుకోని వెళ్తుండగా చేవెళ్ల మండలంలో ని కుమ్మెర గేటు సమీపంలోకి రాగానే గేదె ఆటోకు అడ్డం రావడంతో గేదెను తప్పించబోయి ఆటో కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రమేశ్కు కాళ్లు వీరుగగా మరో ఐదు మందికి స్వల్వ గాయాలయ్యాయి. వీరిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.