ముంబై : గత కొద్దినెలలుగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూ ఆన్లైన్ వేదికగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. స్కామర్లు రోజుకో తరహా స్కామ్తో బాధితులను నిండా ముంచుతున్నారు. తాజాగా పూణేకు చెందిన మహిళను ఆన్లైన్లో హోటల్స్కు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అధిక మొత్తం ఆర్జించవచ్చని మభ్యపెట్టిన స్కామర్లు ఆమె నుంచి రూ. 13 లక్షలు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ పుణేలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
జులై 18న ఆన్లైన్లో ఆమెను సంప్రదించిన స్కామర్లు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేశారు. ఆఫర్ను ఆమె అంగీకరించగా హోటల్స్, రెస్టారెంట్స్కు ఆన్లైన్లో రేటింగ్స్ ఇవ్వాలని కోరారు. ప్రతి రేటింగ్కూ రూ. 150 ఇస్తామని నమ్మబలికారు. ముందుగా కొన్ని టాస్క్లు పూర్తిచేసిన అనంతరం ఆమెకు డబ్బు చెల్లించారు. బాధితురాలి నమ్మకం చూరగొన్న అనంతరం కొన్ని ప్రీపెయిడ్ టాస్క్లు పూర్తిచేయాలని కోరారు.
ఆపై అక్టోబర్ 13వరకూ ఆమె పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ టాస్క్లను పూర్తి చేసింది. ఇక తాను ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో పాటు లాభాన్ని విత్డ్రా చేసేందుకు మహిళ ప్రయత్నించగా నిరాకరించిన స్కామర్లు అధిక రిటన్స్ పొందేందుకు మరికొంత ఇన్వెస్ట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More :
Encounter | బీజాపూర్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి