గురుగ్రాం : స్పా సెంటర్ పేరుతో వ్యభిచార రాకెట్ నడిపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో స్పా మేనేజర్ సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రాంలోని సెక్టార్ 51లోని మాల్లో స్పా సెంటర్పై పోలీసులు దాడి చేశారు. ఇద్దరు మహిళలను ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారు.
అరెస్టయిన స్పా మేనేజర్ను ఢిల్లీలోని కరోల్ బాగ్కు చెందిన యోగేష్ కుమార్గా గుర్తించారు. స్పా యజమాని సెక్టార్ 15కు చెందిన భగత్ సింగ్ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. స్పా పేరిట చీకటి దందా జరుగుతుందనే సమాచారం రావడంతో ఏసీపీ అభిలాష్ జోషి నేతృత్వంలో పోలీసులు డెకాయ్ కస్టమర్లుగా స్పాలోకి వెళ్లారు. సర్వీస్ కోసమని మేనేజర్కు రూ 2000 చెల్లించి లోపలకు వెళ్లారు.
స్పాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించి టీంలో ఇతర సభ్యులను రప్పించి దాడులు చేపట్టారు. స్పా పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్టు స్పా మేనేజర్ అంగీకరించాడని, స్పా యజమాని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.