జైపూర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా రాజస్ధాన్లోని కోట జిల్లా కొటువ గ్రామంలో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ప్రైవేట్ ట్యూటర్ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్ధానిక మదర్సాలో ఉండే నిందితుడు అబ్దుల్ రహీం (43) చిన్నారులకు ఉర్ధూ పాఠాలు చెబుతుంటాడు.
ఈ క్రమంలో ఆదివారం ట్యూషన్కు వచ్చిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.