అమరావతి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో సోమవారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. మండలంలోని కోడూరుతోపు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మరో వాహనాన్ని ఓవర్టైక్ చేయబోయి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ సంఘటనలో గాయపడ్డ 8 మందిని స్థానికులు హిందూపురం దవాఖానకు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.