జైపూర్: కుటుంబసభ్యుల మధ్య రాజుకున్న గొడవ చినికిచినికి గాలివానలా మారింది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు రెండు వర్గాలుగా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. పదునైన ఆయుధాలతో పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ 60 ఏండ్ల వృద్ధుడు, గర్భిణి అయిన అతని 36 ఏండ్ల కూతురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరంలోని చాట్గేట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులు సబీర్ ఖాన్ (60), నఫీసా (36)గా గుర్తించారు. గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురిపైన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.