చెన్నై : నాటు వైద్యుడు ఇచ్చిన అబార్షన్ ట్యాబ్లెట్ను తీసుకున్న మైనర్ బాలిక (15) మరణించిన ఘటన తమిళనాడులోని తిరువన్మలై జిల్లా చెంగమ్ ప్రాంతంలో కలకలం రేపింది. మురుగన్ (27) అనే వ్యక్తి బాలికను రోజూ స్కూల్ వద్ద దింపేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం సన్నిహిత సంబంధానికి దారితీసింది.
బాలిక ఇటీవల గర్భవతి కావడంతో మురుగన్ తన స్నేహితుడు ప్రభు సూచనతో నాటు వైద్యుడి వద్ద నుంచి అబార్షన్ ట్యాబ్లెట్ తీసుకున్నారు. బాలికను ఇంటి నుంచి స్కూల్కు తీసుకువెళతామని నమ్మబలుకుతూ మార్గమధ్యలో ఆమెకు ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు. ట్యాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికే బాలిక స్ప్రహ కోల్పోయింది. ఆపై బాలికను మురుగున్ దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
పోస్ట్మార్టం నిమిత్తం బాలిక మృతదేహన్ని తిరువన్మలై సర్కార్ దవాఖానకు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా మురుగన్, ప్రభులను పోలీసులు అరెస్ట్ చేశారు. మురుగన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు అబార్షన్ ట్యాబ్లెట్ ఇచ్చిన నాటు వైద్యుడి కోసం గాలిస్తున్నారు.